నిజంనిప్పులాంటిది

Nov 03 2023, 17:26

ఎంఐఎం పార్టీ తొలి జాబితావిడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంఐఎం శుక్రవారం ప్రకటించింది.

9 నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగనుంది. జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పుర, బహదూర్ పుర, కార్వాన్, మలక్‌పేట్, నాంపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది.

తొలి విడతగా పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.

అభ్యర్థులు వీరే

1)చాంద్రాయణగుట్ట-అక్బరుద్దీన్ ఓవైసీ

2)చార్మినార్- మీర్ జుల్ఫిఖర్ అలీ

3)కార్వాన్-కౌసర్ మొయినుద్దీన్

4)మలక్‌పేట్-బలాల

5)నాంపల్లి-మహమ్మద్ మాజీద్ హుస్సేన్

6)యాకుత్ పురా-జాఫర్ హుస్సేన్

నిజంనిప్పులాంటిది

Nov 03 2023, 17:25

ఓటు అడిగే హక్కు బిజెపికి,కాంగ్రెస్ కి లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

కేసీఆర్ మాట్లాడుతూ..ఇవాళ బీజేపీ పార్టీ అభ్య‌ర్థిని మీరు ప్రశ్నించాలి.అని కేసీఆర్ సూచించారు. మోదీకి ప్ర‌యివేటైజేష‌న్ పిచ్చి ప‌ట్టుకుంది. విమానాలు, ఓడ‌రేవులు, రైల్వేలు, లోక‌మంతా ప్ర‌యివేటు. చివ‌ర‌కు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. బోర్ మోటార్ల కాడా మీట‌ర్లు పెట్టాల‌ని ఆర్డ‌ర్ చేశారు.

నేను దానికి ఒప్పుకోలేదు నేను ఒకటే చెప్పిన పాణం పోయినా త‌ల తెగిప‌డ్డా వ్యవసాయానికి మీటర్లు పెట్ట‌ను అని చెప్ప‌ను. ఏడాదికి వ‌చ్చే రూ.5 వేల కోట్లు క‌ట్ చేస్తాన‌ని చెప్పాడు.

అలా ఐదేండ్ల‌కు క‌లిసి రూ. 25 వేల కోట్లు న‌ష్టం చేసిండు. మ‌న‌కు రావాల్సింది రాకుండా.. మీట‌ర్లు పెట్ట‌లేదు అని బంద్ పెట్టిండు. రైతాంగం నిల‌బ‌డాలి. రైతులు ఆగ‌మైపోయారు.

రైతులు క‌చ్చితంగా బాగుప‌డాలి. వ్య‌వ‌సాయం బాగుండాల‌నే సిద్ధాంతో ఎంత ఒత్తిడి చేసినా మీట‌ర్లు పెట్ట‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా మీట‌ర్లు పెట్టం. మీట‌ర్లు పెట్టేటోళ్ల‌కు ఓట్లు వేయ‌మ‌ని చెప్పాలి. రూ. 25 వేల కోట్లు క‌ట్ చేసిన పార్టీ ఇవాళ ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ‌ని ప్రశ్నించాలని అన్నారు.

దేశంలో 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశారు. కానీ తెలంగాణ‌కు ఒక్క‌టి ఇవ్వ‌లేదు. 50 ఉత్త‌రాలు రాశాను. ఎందుకు ఇవ్వ‌లే. ఇదేం వివ‌క్ష‌. ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌ని బీజేపీకి ఓటు ఎందుకు వెయ్యాలని కెసిఆర్ ప్రశ్నించారు.

న‌వోద‌య విద్యాయాలు ఇవ్వ‌లేదు. 33 జిల్లాల‌కు న‌వోద‌య విద్యాల‌యాలు రావాలి. ప‌దేండ్ల నుంచి అడుగుతున్నా ఒక్క‌టి కూడా మంజూరు చేయ‌లేదు. మ‌రి న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌ని నాయ‌కులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ మ‌న‌ల్ని ఓట్లుఅడుగుతుంది, వారికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్ప‌క‌పోతే మ‌నమీద‌నే దాడి చేస్తారు.అని కేసీఆర్ అన్నారు..

భైంసా ఎలా అభివృద్ధి చెందిందో మీరు చూస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు. కులం, మ‌తం లేదు. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ మ‌న బిడ్డ‌లే. ద‌ళిత స‌మాజం ఎప్ప‌ట్నుంచో వెనుక‌బ‌డి ఉంది. అణిచివేతకు కు గుర‌య్యారు.

వారు సాటి మ‌న‌షులు కారా..? ద‌ళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఉంటే ఇవాళ ఈ ప‌రిస్థితి ఎందుకు ఉండేది. ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఈ ద‌ళిత బంధు స్కీం తెచ్చింది కేసీఆర్. త‌ప్ప‌కుండా ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి సాయం అందిస్తాం. ద‌ళితులు కూడా ఆలోచించి ఓటేయాలి అని కేసీఆర్ సూచించారు.

భైంసా, ముథోల్‌, నిర్మ‌ల్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌లో ముస్లింలు హిందువులు ఉన్నార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. వంద‌ల ఏండ్ల నుంచి క‌లిసి బ‌తుకుతున్నాం. తాకులాట‌లు పెట్టి మ‌త‌పిచ్చి లేపి భైంసా అంటేనే యుద్ధ‌ మ‌న్న‌ట్టు చిత్రీక‌రించి, త‌న్నుకు చ‌స్తార‌ని అబ‌ద్ధాలు చెప్పి ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం బీజేపోళ్లు చేస్తున్నారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ప‌దేండ్ల‌లో క‌ర్ఫ్యూ లేదు. లాఠీ ఛార్జి లేదు. ఫైరింగ్ లేదు. ప్ర‌శాంతంగా ఉన్న‌ది తెలంగాణ‌. ఇలానే ప్ర‌శాంతంగా ఉండాల్నా.. మ‌త‌పిచ్చి మాటలతో నెత్తురు పారాలా..? మీరు ఆలోచించాలి.

ఎవ‌రి బ‌తుకు వారు బ‌తుక‌కా.. ద్వేషం పెట్టుకుని ఏం సాధిస్తాం. ఏమోస్త‌ది. క‌లిసిమెలిసి బ‌త‌క‌డంలోనే శాంతియుత‌మైన స‌హ‌జీవ‌నం ఉంట‌ది. అంద‌రం గొప్ప‌గా బ‌తుక గ‌లుగుతాం. మ‌న రాష్ట్రంలో ఉన్న అన్ని మ‌తాలు, కులాల వారు క‌లిసి కట్టుగా బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలని కెసిఆర్ కోరారు...

నిజంనిప్పులాంటిది

Nov 03 2023, 17:23

నామినేషన్ పత్రాలతో రేపు కోనయపల్లి లో కేసీఆర్ ప్రత్యేక పూజలు

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు రేపు శనివారం వెళ్ల‌నున్నారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనయపల్లి వెంకటేశ్వర స్వామిని శనివారం ద‌ర్శించుకోనున్నారు.

ఈ సంద‌ర్భంగా స్వామివారి పాదల వ‌ద్ద సీఎం కేసీఆర్ నామినేష‌న్ ప‌త్రాలు ఉంచి పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ముందు నామినేషన్ పత్రాలను స్వామివారికి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తారు.

ఆరాధ్య దైవంగా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం 10 గంటలకు కొనేపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఇది ఆయ‌న‌కు సెంటీమెంట్. ఈసారి కూడా అదే సెంటీమెంట్‌ను సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నారు. ఇక్క‌డ పూజ‌లు నిర్వ‌హించి ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు...

నిజంనిప్పులాంటిది

Nov 03 2023, 09:07

నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి కీలకఘట్టం ప్రారంభంకానుంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది.

ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసి..

ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఆశావహులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

119 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేయనుండగా.. ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించారు. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు..

నిజంనిప్పులాంటిది

Nov 03 2023, 09:06

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..

అమరావతి: ఈ రోజు కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్..

పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది..

విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణ మస్తు – షాది తోఫా మూడో విడత, జగనన్న విద్యా దీవెన మూడో విడతకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల భర్తీ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన, బాధితులకు ప్రభుత్వ పరిహారం, జగనన్న ఆరోగ్య సురక్షా తదితర అంశాల పై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..

విశాఖ నుంచి పాలన దిశగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తుంది. విశాఖలో పరిపాలన భవనాల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ భవనాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ సీఎం వైఎస్‌ జగన్‌కి వివరించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే.

విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్‌ జగన్‌కు కమిటీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది.. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ సీఎంకు వివరించింది..

నిజంనిప్పులాంటిది

Nov 03 2023, 09:05

నేడు భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళ్తోంది. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు రోడ్ షోలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఇలా ముగ్గురు గులాబీ ముఖ్య నేతలు ప్రచారంలో తమ జోష్ చూపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రజాఆశీర్వాద సభలకు హాజరవనున్నారు.

మొదటగా నిర్మల్ జిల్లాలోని భైంసాలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

ఈ మూడు సభల అనంతరం కేసీఆర్ తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యంగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు

ఆగమవుతాయని నొక్కివక్కానించి చెబుతున్నారు..

నిజంనిప్పులాంటిది
నిజంనిప్పులాంటిది

Nov 02 2023, 16:49

తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తే మహిళలకు నెలకు 4000 రూపాయల ప్యాకేజీ : రాహుల్‌ గాంధీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.

ఈరోజు ఆయన రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ మహిళలకు నెలవారీ రూ.4000 ప్యాకేజీని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం దోచుకున్న ప్రతి పైసా తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ సమీపంలోని అంబటిపల్లి గ్రామంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దోచుకున్నారని ఆరోపించిన మొత్తం డబ్బును మహిళలకు ‘తిరిగి’ ఇవ్వాలని నిర్ణయించారు. 'ముఖ్యమంత్రి దోపిడీతో తెలంగాణ మహిళలు ఎక్కువగా నష్టపోయారు. ముఖ్యమంత్రి దోచుకున్న సొమ్మును మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

సామాజిక పింఛను, ఎల్‌పిజి సిలిండర్లపై పొదుపు, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.4000 వరకు ప్రయోజనాలు లభిస్తాయని కాంగ్రెస్ నాయకురాలు అన్నారు. తొలివిడతగా మహిళలకు ప్రతినెలా రూ.2500 సామాజిక పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇది కాకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎల్‌పిజి సిలిండర్‌ను సరఫరా చేస్తుంది, ఇప్పుడు దాని ధర రూ. 1,000, ఇది తరువాత రూ.500కి అందుబాటులో ఉంటుంది. అంతే కాదు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా వెయ్యి రూపాయలు సరఫరా చేయనున్నారు.

తెలంగాణలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించిన రాహుల్.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నాయని, అయితే పోటీ కాంగ్రెస్, కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ మధ్యేనని అన్నారు. ఎంఐఎం, బీజేపీ బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నాయన్నారు. కావున దొరల ప్రభుత్వాన్ని తొలగించి పరజాల ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే మీరు పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి.

నిజంనిప్పులాంటిది

Nov 02 2023, 09:04

Rains: నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి

ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నట్లు వివరించింది.

రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి..

నిజంనిప్పులాంటిది

Nov 01 2023, 18:35

కెసిఆర్ తో పోటీకి ఎవ్వరొచ్చినా గంప కింద పెట్టుడే: మంత్రి కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు వచ్చిన మెజార్టీ చూసి ప్రతిపక్షాలు దిమ్మతిరిగి పోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.

బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి పార్టీ కార్యకర్త అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతం ఉద్యమాలకు గడ్డగా మారిందని తెలిపారు.

ఈ ఉద్యమ గడ్డపై సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. కామారెడ్డిలో పోటికి ఎవరొచ్చినా గంప కింద కమ్ముడేనని మంత్రి కేటీఆర్ అన్నారు.ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.

ఈ ప్రాంతం నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ ఏమో ఉద్ధరిద్దామని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పి దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. పలు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా కామారెడ్డి ప్రాంతం ఉందన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా వ్యాపార పరంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించి రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. 200 పింఛన్ ఇవ్వనోడు రూ.4000 పింఛన్ ఎలా ఇస్తాడని కాంగ్రెస్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటిసారిగా ఈ ప్రాంతం నుండి ప్రారంభం అయిందని ఆయన తెలిపారు...